TIRUPATHI;-పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.plesesubscribe

ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మారుస్తాం; మంత్రి నారా లోకేష్శ్రీ సిటీలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ యూనిట్స్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఈరోజు ఎల్జి యూనిట్స్ కు మాత్రమే కాదు.. ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు కంటే పెద్దది. ఇది రాష్ట్రంతో పాటు దేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. 5000 కోట్లకు పైగా పెట్టుబడితో రాష్ట్రానికి ప్రపంచస్థాయి తయారీ యూనిట్ ను ఎల్జి తీసుకొచ్చింది. మేడిన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది.https://www.thehindu.com/news/national/andhra-pradesh/lg-to-set-up-5000-crore-electronics-unit-in-sri-city-of-andhra-pradesh/article69545472.ece

ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మారుస్తాం; మంత్రి నారా లోకేష్
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా శ్రీ సిటీ యూనిట్ లో ఎల్జి ఆవిష్కరించబడింది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు, ఏపీ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నిబద్ధతకు ఇది అర్థం పడుతుంది. సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం అని లోకేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తుండగా.. ప్రముఖ కంపెనీలు ఏపీకి తరలివస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టగా, కొత్తగా మరికొన్ని రాబోతున్నాయి. తాజాగా ఏపీలో ప్రముఖ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గృహోపకరణాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో మంత్రి లోకేష్ ఈ నెల 8న భూమిపూజ చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా ఆరేళ్లలో రూ.5,001 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.. రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది

ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మారుస్తాం; మంత్రి నారా లోకేష్
రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. ఎల్జీ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయనుంది. అలాగే రూ.839 కోట్లతో మరో ఐదు అనుబంధ యూనిట్లు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే శ్రీసిటీలో పలు కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా ఎల్జీ కూడా ఆ జాబితాలో చేరబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు స్నేహపూర్వక విధానాలను అమలు చేస్తోంది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తోంది
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని కంపెనీలు వచ్చాయని.. దీని ద్వారా 5,00,000 ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే టీసీఎస్, ఎన్టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ ప్లాంట్లు రాష్ట్రానికి వచ్చాయి. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.65,000 కోట్ల పెట్టుబడితో 500 యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఆర్సెలార్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ వంటి పెద్ద కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. అలాగే ప్రభుత్వం ఐటీ కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో ఉంది. ఇప్పటికే టీసీఎస్ విశాఖపట్నం వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల భూములు కూడా కేటాయించారు.. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నాయి.

AMARAVATHI;-
ఏపీలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు పై సీఎం చంద్రబాబు హర్షం ప్రకటించారు. ఎల్జి ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం పలుకుతోందంటూ ట్రీట్ చేశారు. శ్రీ సిటీలో 5800 కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రత్యక్షంగా పరోక్షంగా 2500 పైగా ఉద్యోగాలతో ఈ సంస్థ ఏపీ ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ కింద ఈ సంస్థ 100% ప్రోత్సాహకాలు పొందిందని సీఎం తెలిపారు.
ఇది మన రాష్ట్రంలోని పారిశ్రామిక వృద్ధికి ఒక ఉత్తేజ కరమైన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని పేర్కొంటూ శ్రీ సిటీలో ఎల్జి ఎలక్ట్రానిక్స్ కు మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేసిన అనంతరం దిగిన ఫోటోలు సీఎం షేర్ చేశారు.
ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మారుస్తాం; మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (బుధవారం) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏపీకి రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆనందం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ఎన్నో ఉద్యోగావకాశాలు రానున్నాయని అన్నారు. ఎల్జీ రాకతో ఏపీ అంతర్జాతీయ గ్లోబల్ హబ్గా మారబోతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు

ఎల్జీ తమ సిస్టర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఏపీలో ఎల్జీ సిటీ ఏర్పడేలా చేయాలని ఆకాంక్షించారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆదిమూలం, సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, థామస్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా మారుస్తాం; మంత్రి నారా లోకేష్
ఎల్జీ కంపెనీకి ప్రస్తుతం దేశంలో రెండే తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి పుణెలో, మరొకటి నోయిడాలో ఉంది. ఇక మూడో తయారీ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఎల్జీ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మూడో ప్లాంట్ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏపీలోని శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఎల్జీ తయారీ ప్లాంట్లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లు వంటి కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటైన రెండు నుంచి మూడేళ్ల తర్వాత వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఎల్జీ పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిసింది. 20 ఏళ్ల పాటు నీటి సరఫరాలో వందశాతం రాయితీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం. శ్రీసిటీలో ఏర్పాటయ్యే ఎల్జీ ప్లాంట్ ద్వారా ఇటు రాయలసీమతో పాటుగా పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాంతంలో పారిశ్రామికవృద్ధితో పాటుగా స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీసిటీని 2008లో ప్రారంభించారు. నాలుగు పోర్టులు, రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలకు శ్రీసిటీ అనుసంధానమైంది. దీంతో లాజిస్టిక్ హబ్గా శ్రీసిటీ రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు ఎల్జీ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.