కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు నెల రోజుల గడువు-జూన్ నుంచి కార్డుల పంపిణీ-2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు సరికొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. నెల రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకునేవారికే కాకుండా, ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు, సభ్యుల చేర్పులు, చిరునామా మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.plese subscribe

ఈ-కేవైసీ ఆలస్యమే కారణం
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు నెల రోజుల గడువు-జూన్ నుంచి కార్డుల పంపిణీ-2025
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు నెల రోజుల గడువు-జూన్ నుంచి కార్డుల పంపిణీ-2025 ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఈ-కేవైసీ ప్రక్రియలో తలెత్తిన సమస్యలేనని మంత్రి తెలిపారు. కానీ ఇప్పుడు దాదాపు 95 శాతం వరకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన కొద్దిమందికే ఇంకా ఈ ప్రక్రియ అవసరముందని వెల్లడించారు. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తిచేసిన పౌరులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.https://civilsupplies.ap.gov.in/meesevaservices.jsp
స్మార్ట్ రేషన్ కార్డులు – ఆధునిక సాంకేతికత
ఈసారి జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు పూర్తిగా స్మార్ట్ కార్డులుగా ఉండనున్నాయి. వీటిలో క్యూఆర్ కోడ్ ఉంటుందనీ, ఆ కోడ్ను స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా అందుకున్న రేషన్ సరఫరాల వివరాలు స్పష్టంగా కనిపిస్తాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ఈ కార్డులు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే వెసులుబాటు కల్పిస్తాయని, ఇది పోర్టబులిటీ సౌలభ్యంగా మారుతుందని తెలిపారు.

జూన్ నుంచి కార్డుల పంపిణీ
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు నెల రోజుల గడువు-జూన్ నుంచి కార్డుల పంపిణీ-2025 4.24 కోట్ల మంది పౌరులకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్ నెల నుంచే ఈ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. పౌరులు గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్లి తమ సమాచారం తెలుసుకోవచ్చని, అక్కడ నుంచే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయవచ్చని చెప్పారు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువు ఉంటుందని మంత్రి వివరించారు.
వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు
టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందిస్తూ, ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 12వ తేదీ తర్వాత వాట్సప్ ద్వారా అప్లికేషన్ సమర్పించే అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు నెల రోజుల గడువు-జూన్ నుంచి కార్డుల పంపిణీ-2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలక ప్రకటన చేశారు. మే 7 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా 1.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉందని అంచనా.

క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు
మరోవైపు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. 4.24 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యులు పేర్లు అన్ని కనిపించేలా ముద్రిస్తారు. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక ఈ కేవైసీ పూర్తి అయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోవడంతో.. తమకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి (మే 7) కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అందువల్ల ఇవాళ్టి నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు కొత్త రేషన్ కార్డు కావాలని కోరుకుంటే.. దరఖాస్తు చేయడానికి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లొచ్చు. అక్కడ దరఖాస్తులు ఉంటాయి. వాటిని అక్కడే నింపవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి.. నింపుకొని.. దానికి అటాచ్ చెయ్యాల్సిన పత్రాలను అటాచ్ చేసి.. ఆ తర్వాత తిరిగి సచివాలయంలో ఇవ్వొచ్చు. లేదంటే.. ఆన్లైన్ అధికారిక పోర్టల్ లేదా.. మీసేవా కేంద్రం నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇప్పుడు సేకరించే దరఖాస్తులను త్వరలో అధికారులు పరిశీలిస్తారు. ఈ నెలంతా ఈ ప్రక్రియ సాగుతుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మొదలవుతుంది. జూన్ నెల చివరినాటికి స్మార్ట్ కార్డుల జారీ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయనీ.. అవి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ఉన్నాయని వెల్లడించారు.
ఈ కొత్త రేషన్ కార్డులు చిన్నగా ఉంటాయి. ATM కార్డు సైజులో ఉంటాయి. కానీ వీటిలో అన్ని వివరాలూ స్మార్ట్గా స్టోర్ అవుతాయి. వీటికి హై సెక్యూరిటీ ఫీచర్లూ ఉంటాయి. ఐతే.. ఈ కార్డులపై వ్యక్తుల ఫొటోలు ఉండవు. పేర్లు మాత్రమే ఉంటాయి. ఇటీవల పాత రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది పూర్తైన తర్వాత.. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగివుండకూడదు. అలాగే.. గ్రామాల్లో నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువ, పట్టణాల్లో రూ.12,000 కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పత్రంతో జత చేసే జిరాక్సు పత్రాల్లో ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఈ స్మార్ట్ కార్డులు పారదర్శకతను పెంచుతాయనీ, పేద ప్రజలకు సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఇతర అవసరమైన సరుకుల్ని సులభంగా అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే వచ్చే వారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా రేషన్ సేవలను అందించే ప్లాన్ ఉందని మంత్రి తెలిపారు. తద్వారా.. ప్రజలు మరింత తేలికగా.. కొత్త రేషన్ కార్డులు పొందడానికి వీలవుతుంది.
ఈ కొత్త రేషన్ కార్డులను సంక్రాంతి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకు అనుకుంది. కానీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. అందువల్ల కొత్తవి ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ రేషన్లో బియ్యంతోపాటూ.. అక్కడక్కడా కందిపప్పు, పంచదార ఇస్తున్నారు. త్వరలో రాగులు కూడా ఇచ్చే ప్లాన్ ఉంది. అందువల్ల కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వీటిని పొందడానికి వీలవుతుంది.
ముఖ్య సూచనలు
కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు మే 7వ తేదీ నుంచి దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తుకు ఒక నెల గడువు ఉంటుంది.
గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫారములు అందుబాటులో ఉంటాయి.
ఈ-కేవైసీ పూర్తయినవారు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.
జూన్ నెల నుంచి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తాయి.
సాంకేతిక అవగాహన ఉన్నవారు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు.