OPERATION SINDOOR-2025 పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది.PLESE SUBSCRIBE

OPERATION SINDOOR-2025
ఉగ్రదాడికి పాకిస్థాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మద్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తమైంది.
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్తు దేశం రగిలిపోయింది. పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అందుకు అనుగుణంగా అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి.. రెండు వారాల అనంతరం ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపుదాడి చేసింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి.. వెనక్కి వచ్చింది.https://www.thehindu.com/news/national/pahalgam-terror-attack-operation-sindoor-launch-live-updates-may-7-2025/article69543511.ece

OPERATION SINDOOR-2025
RAHUL GANDHI
ఆపరేషన్ సిందూర్పై రాహుల్ గాంధీ స్పందన
ఆపరేషన్ సిందూర్పై కాంగ్రెస్ పార్టీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. భారత త్రివిధ దళాలు చేసిన ప్రతీకార దాడులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సైన్యం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. సక్సెస్ ఫుల్గా ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలకు ప్రేమతో శుభాకాంక్షలు చెబుతున్నానని రాహుల్ గాంధీ వెల్లడించారు
చైనాకు భారత్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది
OPERATION SINDOOR-2025
రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నాం
రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నాం.. రాజ్నాథ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా అమాయకులను చంపినవారిని హతమార్చామని కేంద్ర రక్సణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత సైనిక చర్య తర్వాత మీడియాతో తొలిసారి మాట్లాడిన ఆయన.. మోదీ నాయకత్వంలో శత్రువులకు భారత్ తగిన గుణపాఠం చెప్పామని తెలిపారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని, అత్యంత కచ్చితత్వంతో సైనిక చర్య చేపట్టామన్నారు. ఆంజనేయుడ్ని మేము ఆదర్శంగా తీసుకున్నామని అన్నారు. పాక్లో సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా దాడి చేసి.. భారత్ సైన్యం సత్తా చాటిందన్నారు

ఉద్రిక్తతలు పెంచడం మా ఉద్దేశం కాదు.. కానీ,.. అజిత్ దోవల్
ఆపరేషన్ సిందూర్పై అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాల ఉన్నతాధికారులకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం ఎలాంటి ఉద్రిక్తతను కోరకున్నప్పటికీ, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై దృఢంగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పాకిస్థాన్, పీఓకేలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత మిసైల్ దాడుల గురించి కూడా వారికి వివరణ ఇచ్చారు. రష్యా, ఫ్రాన్స్ అధికారులతో కూడా మాట్లాడారు. ‘భద్రతా సలహాదారు చేపట్టిన చర్యలు, వాటి అమలుకు గల కారణాలను వివరించారు. ఆ చర్యలు పరిమితమైనవి.. ఉద్రిక్తతలు పెంచకుండా, నియంత్రితంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్కు ఉద్రిక్తత పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆయన, కానీ పాక్ దాడికి దిగితే దానికి సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు పూర్తిస్థాయిలో భారత్ సిద్ధంగా ఉందని గట్టిగా చెప్పారు’ అని ఓ అధికారి తెలిపారు.

సైనిక దళాల దేశభక్తి.. ధైర్యానికి మా సెల్యూట్.. కాంగ్రెస్
పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి.. ఉగ్రస్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్ సైన్యం తెగువ, దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఆర్మీకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. పాక్ రక్షణ మంత్రి
భారత్ సైనిక చర్యపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆచితూచి మాట్లాడారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని,ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తే తాము కూడా అందుకు సహకరిస్తామని వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా తాము ఎలాంటి దాడిచేయలేదని, మాపై దాడిచేస్తే స్పందిస్తామని అన్నారు.

పాక్లోకి ప్రవేశించి భారత్ దాడి చేసిందిలా?
పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఆపరేషన్ సిందూర్ గురించి స్పందించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. గురి తప్పని, సమయానుకూలమైన, పరిస్థితిని మరింత దిగజార్చని చర్య అని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను తాకలేదని కూడా తెలిపింది.
సినిమా ఇంకా అయిపోలే..ఆర్మీ మాజీ చీఫ్ సంచలన పోస్ట్
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిబ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఈ నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుందు నరవాణే పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది’ అంటూ ఆయన పోస్ట్ చేశారు

ఆపరేషన్ సిందూర్ ‘ నేపథ్యంలో పాకిస్తాన్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర మీటింగ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉక్కిరిబిక్కరవుతోంది. ఎటూపాలుపోని స్థితిలో యావత్ పాక్ యంత్రాంగం తలలు దించుకున్న పరిస్థితి. పరిస్థితిని సమీక్షించేందుకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసరంగా నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాల్గొన్న వారంతా తలలదించుకొని గంభీరంగా కనిపించారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయలేమనే భావన అందరి కళ్లలో కనిపించింది.
యుద్ధం వస్తే పాకిప్తాన్ ఆరు రోజుల్లో చేతులెత్తేయడం ఖాయమని.. పాకిస్తాన్ ఆర్మీకి భారత జవాన్లతో పోరాడే ధైర్యం లేదన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఒబెరాయ్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడి భారతీయులకు గర్వకారణమని పీఓకేని భారత్ స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఒబెరాయ్.
OPERATION SINDOOR-2025
ఆపరేషన్ సింధూర్ను పూర్తిగా స్వాగతిస్తున్నాం- మల్లికార్జున ఖర్గే
ఆపరేషన్ సింధూర్ను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబు ఇచ్చిందని ఆయన తెలిపారు. భద్రతా దళాల ధైర్యం, దేశభక్తి ఎంతో గొప్పదన్నారు. ఉగ్రదాడి జరిగినప్పుడే కేంద్రానికి, సైన్యానికి అండగా ఉంటామని చెప్పామన్నారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ అనంతరం తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించారు. అంతేకాకుండా.. ప్రస్తుత పరిస్థితులు.. మాక్ డ్రిల్ తదితర అంశాల గురించి చర్చించారు

రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.
భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదన్నారు యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని… శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని యూఏఈ సూచించింది.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ చెక్పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత్ ఆర్మీని ఎదురుకోలేక సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం. కశ్మీర్ సహా ఎల్వోసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. యూరీ, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి. పాక్ సైన్యం కాల్పులను తిప్పికొడుతుంది భారత సైన్యం.
LOCకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదస్థావరం బర్నాల బింబర్ క్యాంప్. ఇది ఉగ్రవాదులకు ఆయుధాల ఉపయోగం, IEDల తయారీ, అడవుల్లో మనుగడ సాగించడం వంటి విషయాల్లో ఉగ్రమూకలకు ఇది శిక్షణ ఇచ్చే కేంద్రం. ఇది కూడా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైంది
OPERATION SINDOOR-2025
భారత్ ఎటాక్తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రమూకలు ఛిన్నాభిన్నం
పాక్లో పన్నెండో అతిపెద్ద నగరం బహావల్ పూర్. లాహోర్ నుంచి నాలుగొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జామియా మసీదు సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ భవనానికి ఉస్మాన్ ఓ-అలీ క్యాంపస్ అనే పేరు కూడా ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఇది ఉంటుంది. రిక్రూట్మెంట్, నిధుల సేకరణను జైష్ దీన్ని ఉపయోగిస్తోంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ బహావల్పూర్లోనే పుట్టాడు. ఇక్కడే అత్యంత పటిష్ఠమైన భవనంలోనే అతని నివాసం. జైషే మహమ్మద్ అంటే మహమ్మద్ సైన్యమని అర్థం. పాక్ సైన్యానికి చెందిన 31 కార్ప్స్ హెడ్క్వార్టర్స్కు కొద్ది దూరంలోనే జైషే మహమ్మద్ క్యాంప్ ఉంటుంది. ఇంత దగ్గరగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుందంటే దానికి ISI సంపూర్ణ సహకారం ఉందనే విషయం తేటతెల్లవుతోంది. ఈ ప్రాంగణంలో ఒక భారీ మసీదు ఉంది. ఇందులో ఉన్న మదర్సాలో 600 మంది శిక్షణ పొందుతున్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, గుర్రాల స్టేబుల్, జిమ్ కూడా ఉంది.
బహావల్పూర్ ఉగ్రవాద శిబిరం..
ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్ ఇదే
పుల్వామా, పార్లమెంట్పై దాడి వెనుక జైష్ హస్తం ఉంది
బహావల్ పూర్ అనేది పాక్లో 12వ అతిపెద్ద నగరం
ఇక్కడున్న జామియా మసీద్ సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ కార్యకలాపాలు
దీనికే ఉస్మాన్ ఓ-అలీ క్యాంపస్ అని పేరు
దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్ క్యాంప్
జైషే మహమ్మద్ అంటే మహమ్మద్ సైన్యమని అర్థం..
పాక్ సైన్యానికి చెందిన 31 కార్ప్స్ హెడ్క్వార్టర్స్కు కొద్ది దూరంలోనే ఈ జైషే మహమ్మద్ క్యాంప్
ఈ జైషే మదర్సాలో 600 మందికి ఉగ్ర శిక్షణ
ఆపరేషన్ సింధూర్తో నామరూపాల్లేకుండా పోయిన జైషే మహ్మద్
మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతం
నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మసూద్ అజర్ ఏడుపు
మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్
ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం
మిసైళ్ల దాడిలో నేలమట్టమైన మసూద్ బహావల్పూర్ డెన్
జైషే మహ్మద్ చీఫ్ కుటుంబం సహా నలుగురు సన్నిహితుల హతం
భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మసూద్ ఏడుపులు
ఇక భారత్పై జాలి చూపను అంటూ మసూద్ బీరాలు
భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదు అంటూ లేఖ
ఈ అర్థరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర మధ్య ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఈ ఆపరేషన్ ఎలా నిర్వహించింది, వేటిని లక్ష్యంగా చేసుకున్నారో ఆ వివరాలు సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా, ఎయిర్ఫోర్స్కు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు