Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025

Table of Contents

Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి-గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడు లో గుడిసెలు కూల్చేసిన కేసు..ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2013 డిసెంబర్ 6 2014 జనవరి 8వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని అడవి తక్కెళ్ళపాడు గ్రామంలో గుడిసెలు కూల్చివేసిన కేసులో కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.plese subscribe

డిప్యూటీ కలెక్టర్ తాతామోహన్రావు పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025 ఢిల్లీ; ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2013 డిసెంబర్ 6 2014 జనవరి 8వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని అడవి తక్కెళ్ళపాడు గ్రామంలో గుడిసెలు కూల్చివేసిన కేసులో కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విధించిన రెండు నెలలు జైలు శిక్షకు బదులుగా తన స్థాయి తగ్గించుకొని తాసిల్దార్ గా పనిచేయడానికి అండర్టేకింగ్ ఇవ్వాలని ధర్మాసనం చేసిన సూచనకు మొగ్గు చూపకపోవడం పట్ల జస్టిస్ బి.ఆర్ గవాయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.https://www.sci.gov.in/

Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025.https://telugu.hindustantimes.com/career/sci-junior-court-assistant-recruitment-2025-apply-for-241-posts-on-or-before-march-8th-2025-121738759603100.html

కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025 హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ రావు దాఖలు చేసిన ఎస్ఎల్పి పై మంగళవారం జస్టిస్ ఏపీ మహి తో కలిసి విచారించిన ఆయన పిటిషనర్ తమ మాట వినకపోతే శిక్షించకుండా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తాసిల్దార్ స్థాయిలో పనిచేయడానికి అంగీకరిస్తూ అండర్ టేకింగ్ లెటర్ సమర్పించాలన్న కోర్టు సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం కోర్టు ఉత్తర్వుల పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. మేం ఆయన కెరీర్ను కాపాడాలనుకున్నాం ఆయన దాన్ని తిరస్కరిస్తే మేమేం చేయలేం దీన్నిబట్టి ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో ఆయన ఎలా వ్యవహరించి ఉంటారు అని జస్టిస్ గురై పేర్కొన్నారు.https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/supreme-court-expressed-its-displeasure-at-a-deputy-collector/1702/125082023

Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025

కోర్టుకు హాజరైన పిటిషనర్ తన విషయంలో ఆధార ఉదారత చూపాలని ధర్మాసనానికి విన్నవించారు. అందుకు జస్టిస్ గురై స్పందిస్తూ మీరు 80 మంది పోలీసులను తీసుకెళ్లి ఇళ్లను కూల్చినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా ఇప్పటికైనా మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. జైలుకెల్లకుండా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వెళ్లాలనుకుంటే వెళ్లి రెండు నెలలు అక్కడ ఉండండి. అప్పుడు మీ ఉద్యోగం కూడా పోతుంది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గుడిసెల జోలికి వెళ్లొద్దని హైకోర్టు చెప్పాక కూడా ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఎంతటి వారైనా చట్టం కంటే గొప్ప కాదు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ఇలా దిక్కర పూర్వకంగా వ్యవహరించినందుకు మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టం అని జస్టిస్ గురై స్పష్టం చేశారు.https://aphc.gov.in/

మొండిగా వ్యవహరిస్తే.. మళ్లీ ఉద్యోగంలోకి రానివ్వం

ఆయన్ను జైలుకు పంపు పంపాలనుకోవడం లేదు ఒకవేళ ఆయన ఇలాగే మొండిగా ఉంటే మేమేం చేయలేం.. మా సూచనపై పిటిషనర్ కు నచ్చ చెప్పడానికి సీనియర్ న్యాయవాది దేవాశిష్ బరుకాకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాం విచారణ తిరిగి ప్రారంభమై తర్వాత కూడా కోర్టు సూచనలు పిటిషనర్ అంగీకరించకపోవడం పట్ల జస్టిస్ గవాయి మండిపడ్డారు. ఇకపై ఆయనకు ఉద్యోగం ఇచ్చే సాహసం చేయకుండా మేం కఠినమైన అబ్జర్వేషన్లు పాస్ చేస్తాం. ప్రోటోకాల్ డైరెక్ట్ గా పనిచేస్తున్నందుకు తాను ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నారేమో మేం ఇంత కఠినంగా ఇదివరకెప్పుడూ లేమ్. ఆయన తలబిరుసుతనం చాలా చెబుతోంది ఇలాగే మొండిగా ఉంటే మేం ఆయన్ను డిస్మిస్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోకుండా చూస్తాం. ఆయన గుడిసెలు కూలగొట్టి అందులో ఉన్నవారికి బయటకెళ్లగొట్టారు మేం కూడా ఇలాగే ఉండాలనుకోవడం లేదు మా సూచనను అంగీకరించకపోతే జైలుకు వెళ్ళమనండి అని స్పష్టం చేశారు. కోర్టు సూచన పై ఆలోచించుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను శుక్రవారం వాయిదా వేశారు.

తహసిల్దార్ గా పని చేయడానికి అంగీకరించకపోతే శిక్ష తప్పదు

జిల్లా సమ్మర్ పేటకు సమీపంలో అడవి తక్కెళ్ళపాడుకు చెందిన గ్రామస్తులు కొందరు తమ ఆధీనంలో ఉన్న స్థలాలను ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ 2013లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, తమ విజ్ఞప్తులను పరిశీలించేలా వారికి ఉత్తర్వులు జారీ చేయాలని తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. వారి దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ స్థలాల్లో వారు నివసిస్తుంటే తాసిల్దార్ తో పాటు ఇతర అధికారులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని 2013 సెప్టెంబర్ 13న ఏక సభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత గుంటూరు టౌన్ మొబైల్ లాండ్రీ యూనియన్ కూడా ఇలాంటి అంశంపైనే హైకోర్టును ఆశ్రయించింది. వారి ఆధీనంలోని స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కూడా తాసిల్దార్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని 2013 డిసెంబర్ 11న కోర్టు మరో ఉత్తర్వులు ఇచ్చింది. ఇళ్ల పట్టాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కొత్తగా అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను, ఇప్పటికే అందులో ఉన్న వాటిని తొలగించేందుకు ప్రయత్నించోద్దని అప్పటి దాసిల్దార్ మోహన్ రావు ను ఆదేశించింది.https://smstechintelugu.com/

Supreme Court; కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025

కోర్టు మాట వినకపోతే జైలుకెళ్లండి 2025 కోర్టు ఇంత చెప్పినా తాసిల్దార్ 2013 డిసెంబర్ 6 2014 జనవరి 8 తేదీల్లో ఆ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించారు. జనవరి 8న అక్కడ 88 మంది పోలీసులను కూడా మోహరించారు. తాసిల్దార్ ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ రెండు నెలలు జైలు శిక్ష రు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మోహన్రావు ఆ తీర్పును డివిజన్ బెంజ్ ముందు సవాల్ చేశారు. తాను అక్కడ బయటివారు ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించానే తప్ప పిటిషనర్ల గుడిసెల జోలికి పోలేదని కోర్టుకు విన్నవించారు. అయితే అందుకు ఆధారాలు చూపలేకపోయానంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ పిటీషనర్లను కొట్టేస్తూ ఫిబ్రవరి 19న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్ రావు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై జస్టిస్ బి.ఆర్ గవాయి ధర్మసనం విచారణ జరుగుతోంది.

Leave a Comment